ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ రాజీనామా

  • సవాంగ్ రాజీనామాను ఆమోదించిన గవర్నర్!
  • వైసీపీ ప్రభుత్వంలో కొంతకాలం డీజీపీగా పని చేసిన గౌతమ్ సవాంగ్
  • ఆ తర్వాత ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియామకం
ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ బుధవారం తవ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమోదించినట్లుగా తెలుస్తోంది. గత వైఎస్సార్ ప్రభుత్వం హయాంలో ఆయన డీజీపీగా పని చేశారు. 2019 మే నుంచి 2022 ఫిబ్రవరి వరకు ఆ పదవిలో ఉన్నారు. ఉద్యోగ విరమణకు రెండేళ్ల ముందే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం ఆయనను ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమించింది. ఆయన 2022 మార్చిలో ఏపీపీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈరోజు ఆయన తన పదవికి రాజీనామా చేశారు.

Goutham Sawang
Andhra Pradesh
APPSC

More Telugu News